మోదీకి వాలంటైన్ గిఫ్ట్​గా గోల్డెన్ రోజెస్.. ఎవరిచ్చారంటే..?

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వాలంటైన్ డే గిఫ్ట్​గా బంగారు గులాబీలు వచ్చాయి. మోదీకి వాలంటైన్ గిఫ్ట్ ఏంటని అనుకుంటున్నారా..? అసలు ప్రధానికి అలాంటి బహుమతి.. అది కూడా ప్రేమికుల రోజున.. ఎవరిచ్చారని ఆశ్చర్యపోతున్నారా..? మరి ఆ సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రేమికుల రోజున ఓ అరుదైన బహుమానం వచ్చింది. అదేంటంటే.. బంగారు రోజా పూలు. సూరత్​ విద్యార్థులు బంగారు పూత పూసిన గులాబీ పూలను బహుమతిగా మోదీకి ఇచ్చారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోదీకి ఈ బహుమతిని అందించారు. మోదీపై తమకున్న ప్రేమను తెలిపేందుకు ఈ పూలను ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. 24 కారెట్ల బంగారంతో పూత పూసిన 151 గులాబీను మోదీకి బహుమతిగా అందజేశారు.

మోదీకి విద్యార్థులంటే ఎనలేని ప్రేమ అన్న సంగతి అందరికీ తెలిసిందే. విద్యార్థులే దేశ భవిష్యత్తుగా అభివర్ణిస్తుంటారు. ఈ నేపథ్యంలో మోదీపై అభిమానం పెంచుకున్న విద్యార్థులు.. ఈ ప్రత్యేక బహుమతిని ఇచ్చినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news