నా వెంట న‌డిచిన.. ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయింది – నారా లోకేష్

-

నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయిందని నారా లోకేష్‌ తెలిపారు. నందమూరి తారక రత్న మృతిపై నారా లోకేష్‌ సంతాపం వ్యక్తం చేశారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయిందని తెలిపారు. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని వెల్లడించారు. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు అన్నారు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌దని వెల్లడించారు. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నానన్నారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news