పాకిస్థాన్ నుంచి.. MLA రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్

-

తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం 3:34 గంటలకు బెదిరింపు కాల్‌ వచ్చిందని ట్వీట్ చేశారు. తనను చంపుతానని ఓ పాకిస్థానీ.. వాట్సాప్‌ కాల్‌లో బెదిరించినట్లు వెల్లడించారు. ఇండియాలో తమ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయని బెదిరించినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రతిరోజూ ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్న రాజాసింగ్‌… ఈ విషయాన్ని కేంద్రహోం మంత్రి, డీజీపీ, సీపీలకు ట్వీట్​ చేశారు.

తాజాగా రాత్రి 8 గంటల సమయంలో మరో వాట్సప్ సందేశం పంపినట్లు రాజాసింగ్ తెలిపారు. ఇస్లాం మతాన్ని కించపరుస్తున్నందుకు తన గొంతు కోస్తామని బెదిరించినట్లు పేర్కొన్నాడు. తరచూ ఇలాంటి కాల్స్, మెసేజ్‌లు వస్తుంటాయని..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సామాజిక మాధ్యమాల ద్వారా రాజా సింగ్ ఫిర్యాదు చేశారు

Read more RELATED
Recommended to you

Latest news