2014 నుంచి ఎంతమంది కండ్లు పీకావ్… పెద్ద దొర – విజయశాంతి

-

2014 నుంచి ఎంతమంది కండ్లు పీకావ్… పెద్ద దొర అంటూ విజయశాంతి ఫైర్ అయ్యారు. మాట తప్పడం, మాయమాటలు చెప్పడం మన సీఎం సారుకు మామూలే… అడపిల్లకి ఆపద రానివ్వం అంటూ ఆనాడు అంత గొప్పగా కబుర్లు చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు ఆడపిల్లల అమ్మానాన్నల కంట కన్నీరు, కడగండ్లు తప్ప మరేం మిగిలింది? అని నిలదీశారు.

2014లో సారు ఏమన్నరో ఈ వీడియో చూడండి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే తెలంగాణలో ఆడపిల్లకు అన్యాయం జరిగేది కాదు. ఎన్ని కండ్లు పీకినారో జర చెప్తే EYE బ్యాంకుల కన్నా ఉపయోగపడవచ్చు సీఎం గారు అంటూ మండిపడ్డారు విజయశాంతి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారీ నాయకత్వంలో పుంజుకుంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఏకమై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నిప్పులాంటి నిజం వెలుగులీనుతూనే ఉంటుందన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news