BREAKING : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. ఈ కేసులో గత ఆదివారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ 1 గా మనీష్ సిసోడియాను సిబిఐ పేర్కొంది.

అయితే, గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రామచంద్ర పిళ్ళై ను అరెస్ట్ చేసింది ఈడి. కాసేపటి క్రితమే.. రామచంద్ర పిళ్ళై ను అరెస్ట్ చేసింది ఈడి. ఇక రామచంద్ర పిళ్ళై ని విచారణ చేసి.. తీహార్‌ జైలుకే పంపేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారని సమాచారం. కాగా, ఈ కేసులో కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news