కంటతడి పెట్టుకున్న అనసూయ.. కారణమేంటంటే..?

-

టాలీవుడ్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రంగమార్తాండ సినిమా ప్రెస్ మీట్ లో అనసూయ కంటతడి పెట్టారు. సినిమా ఫైనల్‌ కాపీ చూసి తనకి కన్నీళ్లు వచ్చేశాయని అన్నారు.

‘‘సినిమా ప్రమోషన్స్‌ విషయంలో కంగారు పడి తరచూ మా దర్శకుడు కృష్ణవంశీకి కాల్‌ చేసేదాన్ని. సర్‌.. ప్రమోషన్స్‌ ఇంకా మొదలుపెట్టలేదు ఎలా? అని ఆయన్ని అడగ్గా  ‘మన సినిమా మాట్లాడుతుంది’ అని సమాధానం ఇచ్చేవారు. ఈ క్షణం చాలా ఎమోషనల్‌గా ఉంది. ‘రంగమార్తాండ’ వంటి గొప్ప సినిమాలో భాగం అయ్యాను. నా జీవితానికి ఇది చాలు. సోమవారం సాయంత్రం ఈ సినిమా చూశాను. అక్కడే ఆగిపోయాను. సినిమాలో నటించాను కదా.. దీన్ని అంత ఎమోషనల్‌ కానులే అనుకుని ధైర్యం, పొగరుగా వెళ్లి షోలో కూర్చొన్నాను. ఉన్నట్టుండి కన్నీరు ఆగలేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది’’ అని అనసూయ భరద్వాజ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news