సజ్జల..ఓ వైసీపీ మగ లక్ష్మీపార్వతి – రఘురామ సెటైర్లు

-

తమ పార్టీలోనూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక వర్గం ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మీపార్వతిగా సంబోధిస్తుంటే, మరొక వర్గం ఎమ్మెల్యేలు మగ లక్ష్మీపార్వతి అని అంటున్నారన్నారని రఘురామ విమర్శలు చేశారు. పరిస్థితి చేయి దాటకముందే, మగ లక్ష్మీపార్వతిని పక్కన పెట్టకపోతే నలుగురు కాస్త 40 మంది అయి, ఇంకా ఎక్కువ మందిలో అసంతృప్తి పెరిగి అసెంబ్లీలో ఏదైనా ప్రతిపాదన పెడితే పరిస్థితి దారుణంగా ఉండవచ్చునని హెచ్చరించారు. ఇప్పటికీ మెజారిటీ మంది శాసనసభ్యులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారినే ప్రేమిస్తున్నారని, ఆయన తక్షణమే అపరిచితుడు క్యారెక్టర్ వీడి, రామాచారి క్యారెక్టర్ లోకి రావాలని, రామాచారిగా ఒకే ఒక పాత్ర పోషించాలని సూచించారు.

ఎమ్మెల్యేలంతా ఒకప్పటి సాక్షి దినపత్రిక ఉద్యోగి అయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రిపోర్టు చేయాలనడం సరికాదని, ఉద్యోగులు తమ సమస్యలైనా, ఎమ్మెల్యే లైన, మంత్రులనైనా వారికి విలువ ఇవ్వకుండా సజ్జల గారినే కలవాలని జగన్ మెహన్ రెడ్డి గారు సూచించడం కరెక్ట్ కాదని, రాజకీయ పార్టీ అంటే మీ అబ్బ బాబు సొత్తు కాదని, పార్టీ సభ్యులందరికీ అధినేత జవాబుదారీగా ఉండాలని, తాను ఈ పార్టీ సభ్యుడనేనని, పార్టీ అధ్యక్షుడితో పాటు, సజ్జల గారు కూడా నాకు జవాబు దారే అని అన్నారు. నేను ఇష్టం ఉన్నట్టు పార్టీని నడుపుతాను అంటే కుదరదని, మీ వ్యక్తిగత జీవితంలో మాత్రమే ఇష్టం వచ్చినట్లు ఉంటానంటే చెల్లుతుందని, పార్టీ నిర్వాహణ విధి, విధానాలు ఏమిటో ఎన్నికల సంఘం పొందుపరిచిన నియమావళిని ఒక్కసారి చదువుకొండని రఘురామకృష్ణ రాజు గారు హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news