మోదీ, యోగిని చంపుతామంటూ మెయిల్​.. అప్రమత్తమైన పోలీసులు

-

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కు మరోసారి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి ఏకంగా ఆ ఇద్దరిని ​ చంపుతానంటూ ఓ అంగంతుకుడు బెదిరించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఈ మెయిల్​ చేశాడు.  ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రధానినే చంపుతామని బెదరింపులు రావడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు.

నోయిడాలోని ఓ ప్రైవేట్​ మీడియా సంస్థ ఛీఫ్ ఫైనాన్షియల్​ ఆఫీసర్​కు.. ఏప్రిల్​ 3న రాత్రి 10:23 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్​లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​లను చంపేస్తానని బెదిరించాడు. [email protected] అనే మెయిల్ ఐడీతో తమ కార్యాలయానికి సందేశం వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న వెంటనే.. రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నోయిడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్​ రజనీశ్​ వర్మ తెలిపారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం కావడం వల్ల.. కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు  వెల్లడించారు. .

Read more RELATED
Recommended to you

Latest news