ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అక్కడి పాలకులే దురదృష్టం – మంత్రి జగదీష్‌ రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అక్కడి పాలకులే దురదృష్టం అన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గం ప్లీనరీ సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దురదృష్టం ప్రకృతి వనరుల వల్ల రాలేదు..ఆనాడు సమైక్యాంధ్ర పేరుతో పట్టిన శని గ్రహాలే నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెంటాడుతున్నాయని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని తీసుకుంటే.. తెలంగాణను బంగారు తెలంగాణ చేసినట్లుగానే.. ఆంధ్రప్రదేశ్ ను సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులు, ఓడరేవులు, ప్రకృతి సంపద అపారం.. అంతర్జాతీయ వ్యాపారానికి అనువైన ఓడరేవులు ఉన్నాయి.. కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్నారు.. ప్రజల గురించి ఆలోచించే నేతలే లేరన్నారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ, లకు ఛాన్స్ లేదు..మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు కూడా తెలంగాణలో కలవాలని కెసిఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news