భారతీ కోసమే షర్మిల.. విజయమ్మను జగన్ దూరంగా పెట్టాడు – గోనె ప్రకాష్

-

భారతీ కోసమే షర్మిల.. విజయమ్మను జగన్ దూరంగా పెట్టారని గోనె ప్రకాష్.. సంచలన కామెంట్స్‌ చేశారు. జగన్ జైలుకెళ్తే భారతీని సీఎం చేయాలని జగన్ భావిస్తున్నారని.. వెల్లడించారు. టీడీపీ-జనసేన కలిస్తే 151 సీట్లు దాటుతాయి… విడిగా పోటీ చేసినా టీడీపీకి 100 సీట్లు దాటుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని బాండ్‌ పేల్చారు. ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్లు.. మరే రాష్ట్రంలోనూ లేవని.. సంక్షేమం ఎన్టీఆరుతోనే మొదలైందని వివరించారు. కానీ ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయారు.

ఎన్టీఆర్ కంటే జగన్ గొప్పొడా..? సంక్షేమం నిధులు జగన్ తన జేబుల్లో నుంచి ఇస్తున్నారా.. అని నిలదీశారు. షర్మిళ పోలీసులను కొట్టారని నేనో వీడియోలో చూశాను… చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. షర్మిళ నా కూతురు లెక్క.. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడను…షర్మిళ రోడ్డెక్కడానికి కారణం ఎవరు..? జగన్ కాదా..? అని నిలదీశారు. ఆమె పక్క రాష్ట్రానికి వెళ్లి పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? జగన్ షర్మిళను చిత్రహింసలు పెడుతున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news