పటిష్ట పోలీసు వ్యవస్థ తోనే ప్రజలు క్షేమం – మంత్రి మల్లారెడ్డి

-

పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజలందరూ క్షేమంగా ఉంటారని అన్నారు మంత్రి మల్లారెడ్డి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సూరారం పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రైమ్ జరిగిన వెంటనే గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకునే వ్యవస్థ మన దగ్గర ఉండడం వల్లే.. వరుస పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు.

మేడ్చల్ లో కొత్తగా 9 పోలీస్ స్టేషన్లు, రెండు డిసిపి ఆఫీస్ లు, మూడు ఏసీబీ ఆఫీస్ లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ కి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం 60 – 70 పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉండేవని.. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 70 పోలీస్ స్టేషన్లను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news