జైల్ నుంచి సుఖేష్ మరో సంచలనం.. ఒరిస్సా రైలు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

-

BREAKING: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. ఒరిస్సా ప్రమాద బాధితులకు జైల్ నుంచి ఆర్థిక సాయం ప్రకటించాడు సుఖేష్ చంద్రశేఖర్. బాలాసోర్ రైళ్ల ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.10కోట్లు విరాళం ప్రకటించాడు సుకేశ్. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తన లాయర్ ద్వారా చెక్ ను పంపించాడు. ఈడీ కేసులో ప్రస్తుతం జైళ్లో విచారణ ఖైదీగా ఉన్నాడు సుకేశ్.

తను న్యాయంగా సంపాదించిన దాంట్లో నుంచే రూ.10కోట్లు విరాళం ఇస్తున్నానని తెలిపాడు సుఖేష్. ఐటి రిటర్న్ కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా జత చేశాడు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని జైలులో ఉన్న సుఖేష్ కేజ్రీవాల్ అవినీతిపై జైలు నుంచి సంచలన లేఖలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే టిఆర్ఎస్ కార్యాలయంలో 15 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు చేయడం గత రెండు నెలలు క్రితం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news