టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు ఖాయం – ఆదినారాయణ ప్రకటన

-

టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు ఖాయమని బీజేపీ నేత ఆదినారాయణ ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి తెలిపారు.

ఈ విషయంలో కేంద్రంలో ఉన్న అధిష్టానం సైతం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అన్నారు.వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఓ కలుపు మొక్క అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

మడకశిరలో మా నాయకుడు కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. నడ్డా, అమిత్ షా రాష్ట్ర పర్యటనలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తెలిపారు. జగన్ కు బిజెపి అండ లేదు, దండ లేదు.. అండా(గుడ్డు) జాయేగా అంటూ ఎద్దేవా చేశారు. వివేకా కేసులో మా పై ఆరోపణలు చేశారని.. ఈ కేసులో సిబిఐ అసలు నిజాలు తేల్చేసిందని.. వారి శీలం ఏమిటో తెలిపిందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news