కొలంబో టెస్ట్: ఆఘ సల్మాన్ భారీ సెంచరీ (132*) … పాకిస్తాన్ కు భారీ ఆధిక్యం !

-

మొదటి టెస్ట్ లో విజయం పాకిస్తాన్ నే వరించిన సంగతి తెలిసిందే. కనీసం రెండవ మ్యాచ్ లో అయినా గెలవాలని అనుకుంటున్న శ్రీలంకకు ఓటమి తప్పేలా లేదు. ప్రస్తుతం మూడవ రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్ లో అయిదు వికెట్ల నష్టానికి 563 పరుగులు చేసింది. ఏ దశలోనూ శ్రీలంక బౌలర్లు పాక్ ను ఇబ్బంది పెట్టలేకపోయారు. దీనితో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన పాక్ భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా ఓపెనర్ షఫీక్ డబుల్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆఘ సల్మాన్ చూడచక్కని డ్రైవ్ లతో అలరించి సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి పాకిస్తాన్ ఆఘ సల్మాన్ 132 పరుగులతో మరియు మహమ్మద్ రిజ్వాన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పాక్ ఇప్పుడు పరుగుల ఆధిక్యంలో ఉంది.. రేపు ఉదయాన త్వరగానే శ్రీలంకను బ్యాటింగ్ కు అఃవించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news