చంద్రబాబు ఓ కమెడియన్ – ఎంపీ అవినాష్ రెడ్డి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పులివెందులలో చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. నేడు కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు లాగా సీఎం జగన్ సంకుచితంగా ఆలోచించలేదని.. అందుకే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేశారని గుర్తు చేశారు. పులివెందుల గుండాలు, కడప రౌడీలు అని మాట్లాడే పెద్దమనిషి.. ఇక్కడికి వచ్చి అభివృద్ధి పై విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఓ కమెడియన్ అని ఏద్దేవా చేశారు అవినాష్ రెడ్డి. పులివెందుల పర్యటనలో చంద్రబాబు చేసినవి విమర్శలు కాదు.. పచ్చి అబద్దాలని అన్నారు. సెల్ ఫోన్, ఎండ నుండి కరెంట్ నేనే తయారు చేశానని సంబంధం లేని మాటలు మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు ఓ అబద్ధాన్ని ఎంతో గాంబిర్యంగా చెప్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news