వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలవడు – వెల్లంపల్లి

-

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలవడని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పుంగనూరులో పోలీసుల పై టీడీపీ దాడులను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు.

హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు కుట్ర చేస్తున్నారని.. రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా పుంగనూరు ఊరిలోకి వెళ్తానని చంద్రబాబు మొండికేయడంతో ఘర్షణ మొదలైందని వెల్లడించారు. లా అండ్ ఆర్డర్ కోసమే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్ళతో దాడిచేశారని ఫైర్ అయ్యారు. అయినా పవన్ కళ్యాణ్ అనే వెధవ చంద్రబాబు కు సపోర్ట్ చేస్తున్నాడు.. సీఐ అంజూ యాదవ్ ఒక కార్యకర్తను కొడితే పవన్ కళ్యాణ్ హుటాహటీన బయల్దేరాడని తెలిపారు. పోలీసులపై జరిగిన దాడి పవన్ కి కనిపించట్లేదా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలవడు… పెద్దిరెడ్డి పై వ్యక్తిగత కక్షతో చంద్రబాబు అల్లర్లకు పాల్పడుతున్నారని ఫైర్‌ అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడం చంద్రబాబు వల్లకాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news