BREAKING : ఏపీ ‘పది’ పరీక్షల్లో ఇక ఏడు పేపర్లు

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల్లో ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. గతేడాది ఆరు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు తెలిపారు. భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం పేపర్‌ను 50 మార్కులకు మరో ప్రశ్నపత్రంగా ఇస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారని వెల్లడించారు.

ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన సమావేశంలో పదో తరగతి పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులను ప్రకటించారు. రెండు రోజులు జరిగే సామాన్యశాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇస్తారు. మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపరే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న కాంపొజిట్‌ విధానాన్ని రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news