కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న BRS MLA రేఖా నాయక్

-

కాంగ్రెస్‌ టికెట్‌ కోసం బీఆర్ఎస్​కు చెందిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ దరఖాస్తు చేసుకున్నారు. గాంధీభవన్‌లో ఆమె పీఏ దరఖాస్తు అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం రేఖా నాయక్ దరఖాస్తు చేయడం రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది. ఖానాపూర్ అసెంబ్లీ టికెట్‌ కోసం రేఖా నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఆసిఫాబాద్ టికెట్‌ కోసం ఆమె భర్త శ్యాం నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం రాత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రేఖా నాయక్ భర్త కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ ఆమె కూడా హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు.

మరోవwపు … గాంధీభవన్‌లో ఎమ్మెల్యే ఆశావహుల ధరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పోటీ చేయాలనుకునే వారి నుంచి కాంగ్రెస్అ ర్జీలను స్వీకరిస్తోంది. ఐదు రోజుల్లో 280 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సోమవారం ఒక్కరోజే గాంధీభవన్‌లో 220 దరఖాస్తులు అందినట్లు తెలిసింది. దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 25 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. మరో 200లకు పైగా అర్జీలు వస్తాయని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news