ఏటూరునాగారంలో విచిత్రం..50 మందికి పైగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు.. ఎవరు వేశారు..?

-

ములుగు జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఏటూరునాగారంలోని  ఓ వీధిలో సుమారు 50 మందికి పైగా అకస్మాత్తుగా వారి ఖాతాలో నగదు జమైంది. సుమారు 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి డబ్బులు జమ అయ్యాయి. అంతే కాకుండా.. ఇతర బ్యాంక్ ఖాతాల్లో కూడా నగదు జమకావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే కొంతమంది నగదును విత్ డ్రా చేసుకోగా.. అసలు ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం ఎవరికీ అర్థం కాక అయోమయంలో పడ్డారు. బ్యాంక్ అధికారులను అడుగామనుకుంటే ఆదివారం సెలవు కావడంతో కుదరలేదని గ్రామస్థులు అంటున్నారు. కొంత మంది మాత్రం తునికాకు  డబ్బులు పడుతున్నాయని చెబుతున్నారు. దీంతో అందరూ తమ అకౌంట్లలో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఏటూరునాగారం లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు సైతం ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news