ఏపీలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీలో కలకలం రేపింది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు, అభిమానులు ఆందోళనలకు దిగారు. వారిని అడ్డుకుంటున్న పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేస్తున్నారు. చంద్రబాబును చూడటానికి వెళ్తున్న నారా లోకేశ్​ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఆందోళనకు దిగారు.

మరోవైపు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తిరిగే అన్ని బస్సులూ నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో తిరిగే సిటీ బస్సులు కదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్టుండి బస్సులను ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసుల ఆదేశాలు, సూచనల మేరకే బస్సులు రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news