చంద్రబాబును అరెస్ట్‌ చేశారని.. జగన్ ను చూసి జనం హర్షిస్తున్నారు – ఎంపీ భరత్‌

-

చంద్రబాబును అరెస్ట్‌ చేశారని.. జగన్ ను చూసి జనం హర్షిస్తున్నారని ఎద్దేవా చేశారు రాజమండ్రి వైసీపీ ఎంపీ భరత్‌. స్కిల్ డెవలప్మెంట్ స్కీములో అవినీతి జరగలేదని టిడిపి నాయకులు చెప్పటం లేదని… తమ పాత్ర లేదని మాత్రమే చెప్తున్నారని ఆగ్రహించారు. స్కాం జరిగిందని మాత్రం ఒప్పుకుంటున్నారని.. ఆంధ్రప్రదేశ్లో అత్యంత సెక్యూరిటీ ఉన్న జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమేనని తెలిపారు.

Vvip కంటే అత్యంత భద్రత చంద్రబాబు కల్పించామని జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే నివేదిక ఇచ్చారని… చంద్రబాబుకు హౌస్ కస్టడి దేనికి ….బయటకు వచ్చేందుకే ప్రయత్నాలు అంటూ ఆగ్రహించారు. జీవో ఎంఎస్ నెం.4 ప్రకారం సిమెన్స్ సంస్థ 90% ఉచిత ఎయిడ్ గా నిధులు ఇవ్వాలని.. సెక్షన్ 164 సి ఆర్ పి సి కింద పీవీ రమేష్ కన్ఫెషన్ ఇచ్చారని వెల్లడించారు.

చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించడం సరికాదన్నారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం జిఎస్టి ఇచ్చిన నోటీసు వల్ల బయటపడింది..స్కిల్ డెవలప్మెంట్ స్కాం మాత్రమే కాదు.. పోలవరం అమరావతి భూములు స్కాం లు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం చంద్రబాబుకు కావలసిన ప్రతి సౌకర్యం కల్పించిందని.. పవన్ కళ్యాణ్ కు చీకటి ఒప్పందం చంద్రబాబుతో ఉంది అది ప్యాకేజీ ఒప్పందం అని ఆరోపించారు భరత్‌.

Read more RELATED
Recommended to you

Latest news