ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఆ అంశాలపై చర్చ

-

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఇవాళ సమావేశం కానుంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్ కోరారు.

brs party

ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో పార్లమెంట్ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చించనున్నట్లు అలాగే ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపినా.. జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు వంటి కీలక అంశాలపై అకస్మాత్తుగా చర్చించే అవకాశం ఉన్నందున.. ఈ అంశాలపై బీఆర్ఎస్ వైఖరి ఏంటనే దానిపై పార్లమెంట్ సభ్యులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున.. దానిపై బీఆర్ఎస్ వైఖరి గురించి కూడా నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశనం చేయనున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news