ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్

-

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. మొదటి రోజు గోల్డ్ మెడల్​ దక్కకపోయినా.. ఏకంగా ఐదు పతకాలను ఖాతాలో వేసుకున్నారు. ఇక రెండో రోజైన నేడు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది ఇండియా. ఇవాళ జరిగిన 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ గోల్డ్​ మెడల్​ను ముద్దాడింది. ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇదే మొదటి పసిడి పతకం కావడం విశేషం.

రుద్రాంక్ష్‌ పాటిల్‌, ఐశ్వరీ తోమర్‌, దివ్యాన్ష్‌ పన్వర్‌ బృందం ఈ మెడల్​ను సొంతం చేసుకుంది. ఇది వరల్డ్ రికార్డ్ కావడం విశేషం. మొత్తంగా షూటింగ్​లో ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు తాజా దానితో కలిపి మూడు మెడల్స్ వచ్చాయి. అలానే రోయింగ్ విభాగంలో మరో కాంస్య పతకం భారత్​కు దక్కింది. దీంతో రోయింగ్ విభాగంలో ఇప్పటివరకు నాలుగు మెడల్స్​ వచ్చాయి. కాగా, ఆదివారం (మొదటి రోజు) భారత్‌కు ఐదు పతకాలను ముద్దాడిన సంగతి తెలిసిందే. వీటిలో రోయింగ్‌లో రెండు సిల్వర్​ మెడల్స్​, ఓ బ్రాంజ్ మెడల్​.. షూటింగ్‌లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news