తిరుమల భక్తులకు గుడ్ న్యూస్…నేడు శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ ఒకటి నుంచి 22వ తేదీ వరకు రూ 300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను సెప్టెంబర్ 25వ తేదీ అంటే ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. వాస్తవానికి టికెట్లను నిన్న విడుదల చేయాల్సి ఉండేది… కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఇవాళ ఉదయం విడుదల చేయనున్నారు.

అలాగే రేపు ఎల్లుండి తిరుమల వసతి గదులను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఈ షెడ్యూల్ అనుసరించి దానికి అనుగుణంగా దర్శన టికెట్లు మరియు వసతి గదులను బుక్ చేసుకోవాలని కోరారు. కాగా, ఏడుకొండల వాడైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామి వారి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. మహారథంపై మాడవీధుల్లో మలయప్పస్వామి విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news