Chandrababu : రాత్రి 7 గంటలకు లైట్లు ఆర్పి టీడీపీ నిరసన

-

Chandrababu :  చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన తెలిపాలని టిడిపి పిలుపునిచ్చింది. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ నిరాహార దీక్షలకు మద్దతుగా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు దీక్షలు చేయనున్నారు.

కాగా, సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం’ పేరుతో కార్యకర్తలు, సానుభూతిపరులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇక అటు చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా టిడిపి నేతలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే పేరిట ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగించనుండగా… రాజమండ్రి జైలు లో చంద్రబాబు, రాజమండ్రి క్వారీ మార్కెట్ సమీపం లో భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేష్, మంగళగిరి పార్టీ ఆఫీస్ లో అచ్చెన్నాయుడు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టిడిపి నేతలు దీక్ష చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news