ఏపీలోనూ ఐటీ సంస్థలు రావాలి.. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా : కేటీఆర్

-

దేశంలో భవిష్యత్ అంతా ద్వితీయశ్రేణి నగరాలదే అని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి నగరాలు, పట్టణాలకు పరిశ్రమలు తీసుకువస్తోందని చెప్పారు. వరంగల్, హనుమకొండలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్ రూ.900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మణికొండ ఐటీ పార్కులో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు.

రాబోయే పదేళ్లలో హైదరాబాద్ కు, వరంగల్ కు తేడా ఉండదు. ఐటీ రంగంలో భవిష్యత్ అంతా టైర్ 2 నగరాలదే. వరంగల్ లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకు ఐటీ సంస్థలు రావాలి. అక్కడ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారై లను కోరుతున్నాను. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తాను. బెంగళూరు ఐటీ రంగంలో 40 శాతం తెలుగువాళ్లే.అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నచోటే మన యువతకు ఉపాధి దక్కాలి. కులం, మతం పేరుతో కొట్టుకు చావడం మానాలి అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news