ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

-

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలి జిల్లాలో ఫరీద్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడి కోసం గాలిస్తున్న సమయంలో వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..?

ఈనెల 5వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశచూపి షేర్ మహమ్మద్(60) అనే వృద్ధుడు తన వెంట తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తన కూతురి కోసం వెతుకుతున్న తల్లికి అపస్మారక స్థితిలో కనిపించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ ఆ పసిపాప పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు షురూ చేశారు.

అయితే తన కోసం పోలీసులు వెతుకుతున్నారన్న విషయం తెలుసుకున్న మహమ్మద్.. ఇంటినుంచి పారిపోయి.. శుక్రవారం రోజు ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news