BJPకి షాక్..ఎలక్షన్ కోడ్ పరిధిలోకి అమిత్ షా సభ !

-

ఇవాళ ఆదిలాబాద్ లో జరగనున్న జనగర్జన సభలో బిజెపి అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ సభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి వస్తుంది. బిజెపి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఈ సభా ఖర్చు పార్టీ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా అమిత్ షా సభకు తెలంగాణ రాష్ట్ర నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.

ఇక ఇవాళ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి 1:45కి చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ బయల్ధేరి వెళ్లనున్నారు. మరోవైపు ఈనెల 14న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో.. కేంద్రమంత్రి పీయుష్ గోయల్ పర్యటిస్తారు. 15న కేంద్రమంత్రి సాద్వి నిరంజన్‌జ్యోతి.. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. 16న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హుజూరాబాద్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 19వ తేదీన… మధిర నియోజకవర్గం పరిధిలో కేంద్రమంత్రి నారాయణస్వామి పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news