తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. నిన్న 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే 68,828 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

నిన్న ఒక్క రోజే 28,768 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లుగా నమోదు అయింది. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఓవైపు కేసీఆర్​కు వైరల్ ఫీవర్ రావడం.. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆమె శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిసింది. కేసీఆర్​ త్వరగా పూర్తిగా కోలుకోవాలని తిరుమలేశుడిని కోరుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news