తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి బాలినేని లేఖ

-

ఒంగోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో నకిలీ దస్తావేజుల కేసు విషయంలో పోలీసుల తీరుపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుకు నిరసనగా తన గన్ మెన్లను సరెండర్ చేస్తున్నట్లు డీజీపీకి లేఖ రాశారు. ‘అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

నాలుగేళ్ల నుంచి ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్న. ఈ కేసులో తన పక్కనున్న వారినైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దు’ అని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదన్నారు బాలినేని. కాగా కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో ఎస్పీని కోరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. పోలీసులు తన సూచనలను పట్టించుకోక పోవటంతో గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news