హెజ్‌బొల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ వాయుసేన

-

ఇజ్రాయెల్‌లోని అమాయక ప్రజలపై దాడి చేసిన హమాస్‌కు లెబనాన్‌లో రాజకీయ, సైనిక, సామాజిక కార్యక్రమాల్లో చాలా బలంగా ఉన్న.. హెజ్‌బొల్లా మద్దతు ప్రకటించింది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్‌ సైనిక పోస్టులపై, ట్యాంక్‌లపై హెజ్‌బొల్లా  దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకు పడింది. హెజ్‌బొల్లా కీలక లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దళం నేడు దాడులు చేపట్టింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌ తన ఎక్స్‌ ఖాతాలో కూడా ధ్రువీకరిస్తూ దాడి వీడియోను పోస్టు చేసింది. లెబనాన్‌ నుంచి గత కొన్నాళ్లుగా తరచూ దాడులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.

మరోవైపు హమాస్‌ సైనిక లక్ష్యాలపై తమ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్‌ వాయుసేన ట్వీట్‌ చేసింది. సోమవారం రాత్రి గాజా పట్టీలోని 200 హమాస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో హమాస్‌ హెడ్‌క్వార్టర్‌, ఆ సంస్థ ఉపయోగించే బ్యాంక్​ ఉన్నట్లు తెలుస్తోంది. వాయుసేన మాత్రమే కాకుండా.. నేవీ దళం కూడా హమాస్‌పై దాడులు మొదలుపెట్టిందని ఇజ్రాయెల్‌ తెలిపింది. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌, ఆయుధాగారాలను లక్ష్యంగా చేసుకొందని వెల్లడించింది. ఈ దాడుల్లో హమస్‌ సురా కౌన్సిల్‌ అధిపతి ఒసామా మజిని మరణించినట్లు ఐడీఎఫ్‌ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news