ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలిసి పని చేద్దామని రాహుల్ ని కోరాం : ప్రొ.కోదండరామ్

-

ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలిసి పని చేద్దామని కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కోరాం అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ తెలిపారు. కరీంనగర్ లో రాహుల్ గాంధీని కలిశారు. తమకు మద్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరినట్టు కోదండరాం వెల్లడించారు. ఈ విషయంపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు కోదండరామ్.

తెలంగాణలో కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆగమైపోతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే తెలంగాణలో ఏమి సక్రమంగా అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అన్ని పార్టీలతో ఏకమై ఓడించడమే లక్ష్యం అని పేర్కొన్నారు ప్రొ.కోదండరామ్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి తగిన బుద్ది చెబుతుందని మద్దతు కోరుతున్నట్టు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news