వణుకుతున్న హనుమకొండ.. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రత

-

మొన్నటి దాక ఎండలు, ఉక్కపోతతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గత వారం రోజుల నుంచి వేడి కాస్త తగ్గింది. నెమ్మదిగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. సాయంకాలం 6 అయిందంటే చాలు చలి తీవ్ర పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని హనుమకొండ చలితో వణికిపోతోంది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత ఒక్కసారిగా 6.2 డిగ్రీలు తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

హనమకొండలో రాత్రిపూట 22.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం రాత్రి 16 డిగ్రీల సెల్సియస్‌ నమోదైందని అధికారులు తెలిపారు. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయని.. ఉత్తర దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గగా.. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మంలలోనూ స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఖమ్మంలో పగటిపూట సాధారణం కన్నా 3.8 డిగ్రీలు అధికంగా 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. భద్రాచలంలో 1.7, హైదరాబాద్‌లో 1.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news