యువతిని చంపి, యువకుడు ఆత్మహత్యాయత్నం..?

-

హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చంపాపేటలోని స్వప్న అనే యువతిని చంపి హన్మంతు అనే యువకుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్లితే.. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని చంపా పేట లోని రాజీ రెడ్డి నగర్ లో మిస్టరీగా మారిన యువతి హత్య అదే ఇంట్లో ఉంటున్న మరో యువకుడి రెండో అంతస్తు నుంచి అనుమానాస్పద స్థితిలో దూకి ఆత్మహత్య.ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళ్లితే.. చంపా పేట రాజిరెడ్డి నగర్ లో స్వప్న(24). హనుమంతు(25) ఇద్దరు కలిసి ఉంటున్నారు. రోజు గుర్తు తెలియని వ్యక్తులు వస్తుండటంతో ఇంటి యజమాని సైతం పలు మార్లు హెచ్చరించారు.ఈ రోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం రావడంతో ఇంటి యజమాని బయటకు వచ్చారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బయటకు నడుచుకుంటూ వేగంగా వెళ్లి పోవడం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా స్వప్న రక్తం మడుగులో మృతి చెంది ఉంది. తీవ్ర గాయాలపైన హనుమంతు ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలాన్ని సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజ్ సందర్శించి వివరాలు సేకరించారు. మహిళ హత్య గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమంతు బిల్డింగ్ నుంచి ఆత్మహత్య యత్నించడా.. లేక గుర్తు తెలియని వ్యక్తులు నెట్టి వేశారా అనే అనుమానాలు కలుగుతున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news