పార్టీ మారడంపై విజయశాంతి సంచలన పోస్ట్

-

పార్టీ మారడంపై విజయశాంతి సంచలన పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని…. 7 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన వ్యక్తి రాములమ్మ అని కొందరు అంటున్నట్లు తెలిపారు. అలాగే.. బీజేపీని విధాన పూర్వకంగా 1998 నుండి విశ్వసించి దక్షిణ భారతంతో పాటు మిగతా అనేక రాష్ట్రాలలో దశాబ్ధ కాలం పైగా పనిచేసిన నేతగా, స్పష్టమైన హిందూత్వవాదిగా బీజేపీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు ఇంకోవైపు…డిమాండ్‌ చేస్తున్నారన్నారు.

vijayashanthi on chandrababu arrest
vijayashanthi on chandrababu arrest

రెండు అభిప్రాయాలు కూడా ఇప్పుడు తన ముందున్నాయని చెప్పారు. నిజానికి ఇయ్యాల తెలంగాణాల ఉన్న దుర్మార్గ కేసిఆర్ గారి పరిపాలన పరిస్థితుల నుండి కొట్లాడి మన ఉద్యమకారులం తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కొరకు మాత్రమే ఐనా..సినిమా తీరుగా పోలీస్ లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లెక్క ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదని వివరించారు. ఏదైనా ఒక పార్టీ కి మాత్రమే పని చేయగలుగుతామని వెల్లడించారు విజయశాంతి. ఇక ఈ పోస్ట్‌ పెట్టడంతో.. విజయశాంతి కాంగ్రెస్‌ లోకి వెళతారని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news