BREAKING NEWS: చంద్రబాబు, పవన్ భేటీ…కీలక నిర్ణయం

-

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఆసక్తికరంగా హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కలుసుకున్నారు. వీరిద్దరూ దాదాపుగా రెండు గంటల పాటు వివిధ విషయాలపై తీవ్రంగా చర్చించుకున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా కొన్ని కీలక అంశాలను చర్చలోకి తీసుకువచ్చారు. ఇక మరో విషయం హైలైట్ అవుతోంది.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు కలిసి తయారుచేయనున్న ఉమ్మడి మేనిఫెస్టో గురించి కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నారట. ఈ మానిఫెస్టోలో కేవలం అతి ముఖ్యమైన పది అంశాలను పెట్టి మినీ ఉమ్మడి మానిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి చంద్రబాబు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లి అసలైన కార్యక్రమాలను స్టార్ట్ చేయనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

కాగా చంద్రబాబుకు బెయిల్ ఇచ్చింది కేవలం నాలుగు వారాలు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాలను ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి తదుపరి చంద్రబాబు ప్లాన్ ఏమిటన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news