నరసాపురం నుంచే మళ్ళీ లోక్ సభ సభ్యుడిగా పోటీ చేస్తా – రఘురామ

-

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఎంపీలు ఎవరు తిరిగి పోటీ చేయడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ, తాను మాత్రం ఎంపీ గానే పోటీ చేస్తానని, ఎంపీగా ఇతరులు పోటీ చేయడానికి అనాసక్తి ప్రదర్శించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయన్నారు.

విధి నిర్వహణలో నియమావళిని ఉల్లంఘించి, హైదరాబాద్, ఢిల్లీలో మీడియా సమావేశాలను నిర్వహించిన సీఐడీ చీఫ్ సంజయ్ గారిని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారిని శిక్షించాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు. వీటికైనా ఖర్చును వారి నుంచి వసూలు చేయాలని సత్యనారాయణ అనే వ్యక్తి వేసిన పిటీషన్ లో తాను ఇంప్లిడ్ అయినట్లు తెలిపారు. న్యాయమూర్తి గారి సమక్షంలో ఇచ్చిన 164 స్టేట్మెంట్ ను సంజయ్ గారు, సుధాకర్ రెడ్డి గారు బహిర్గతం చేయడం ఖచ్చితంగా నియమావళిని ఉల్లంఘించడమేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news