కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇప్పిస్తా: KTR

-

సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇప్పిస్తానని మంత్రి KTR ప్రకటన చేశారు. కొడంగల్ నియోజక వర్గంలో మంత్రి కేటీఆర్‌ ప్రచారం చేశారు. కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇప్పిస్తా. రేవంత్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తింటారు.

KTR sensational comments on Kodangal road show Revanth

జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా? రేవంత్ రెడ్డి పైసలను నమ్ముకున్నారు. లీడర్లను కొంటున్నారు. కానీ కొడంగల్ ప్రజలను మాత్రం కొనలేరు’ అని కొడంగల్ రోడ్ షోలో తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ కరెంట్ పోయిందన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి నిరసన తెలిపారని గుర్తు చేశారు. అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు బాధపడుతున్నారన్నారు. తెలంగాణలో మనం 24 గంటల విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ అక్కడ 5 గంటలు ఇస్తోందన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతోందన్నారు మంత్రి KTR.

Read more RELATED
Recommended to you

Latest news