నేడు కైకలూరు లో వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్ర

-

ఏలూరు జిల్లా కైకలూరులో వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్ర ఇవాళ కొనసాగనుంది. సీతారామ ఫంక్షన్ హాల్ నుంచి బస్సు బయలుదేరి మార్కెట్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు సభ జరుగనుంది. ఈ సభలో మంత్రులు హాజరు కానున్నారు.

YCP Social Empowerment Bus Yatra in Kaikaluru today

కారుమూరి నాగేశ్వరరావు,(పౌర సరఫరాల శాఖామంత్రి) విడదల రజిని(వైద్య ఆరోగ్య శాఖ మంత్రి), జోగి రమేష్.(గృహ నిర్మాణ శాఖామంత్రి), మోపిదేవి వెంకటరమణ (రాజ్యసభ సభ్యులు), పి నిపే విశ్వరూప్ (మాజీ మంత్రి) మంత్రులు ఈ సభలో పాల్గొంటారు.

కాగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 28 కొత్త సబ్ స్టేషన్ లో ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ 16 సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలను వర్చువల్ విధానంలో చేయనున్నారు. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా రూ. 3,100 కోట్ల వ్యయంతో వీటిని ట్రాన్స్ కో ఏర్పాటు చేస్తోంది. అలాగే కడపలో 750, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు సీఎం సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news