రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన విద్యార్థులు.. ఎందుకంటే..?

-

బాసర రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్‌ నుంచి ముగ్గురు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు దూకేశారు. దీంతో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్పీటీఈఎల్‌ పరీక్ష రాయడానికి బాసర ట్రిపుల్‌ ఐటీకి చెందిన 106 మంది విద్యార్థులు నిజామాబాద్‌ బయలుదేరారు. ఈ క్రమంలో తొందరపాటులో ముగ్గురు అజంతా ఎక్స్‌ప్రెస్‌ కు బదులుగా పర్భని పాసింజర్‌ ఎక్కారు.

ఆ పాసింజర్ కదిలాక వారికి అసలు విషయం తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆ రైల్లోంచి దూకేశారు. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుటున్నారు. ఆ విద్యార్థి వరంగల్‌ జిల్లాకు చెందిన సాయికుమార్‌ అని సమాచారం అందింది.

Read more RELATED
Recommended to you

Latest news