నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో ఇవాళ్టి నుంచి ‘నుమాయిష్‌’ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచిఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండే మార్గాలు ఇవే.. 

సిద్ధిఅంబర్‌బజార్‌, జాంబాగ్‌ల వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాలి అనుకునే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలు ఎంజే మార్కెట్‌ వద్ద అబిడ్స్‌ జంక్షన్‌ వైపు మళ్లించనున్నట్లు సీపీ తెలిపారు.

బేగంబజార్‌ ఛత్రీ నుంచి మాలకుంటవైపు వెళ్లే వాహనాలు అలాస్కా జంక్షన్‌ నుంచి దారుస్సలాం, ఏక్‌ మినార్‌ మసీదు, నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.

దారుస్సలాం(గోషామహల్‌ రోడ్డు) నుంచి అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌ వైపు వెళ్లాలనుకునే వాహనాలు అలాస్కా జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజీ, నయాపూల్‌ వైపు మళ్లించనున్నట్లు వెల్లడించారు.

పోలీసు కంట్రోల్‌ రూమ్‌, బషీర్‌బాగ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ నుంచి బీజేఆర్‌(బషీర్‌బాగ్‌) కూడలి నుంచి అబిడ్స్‌ వైపు పంపిస్తామని పేర్కొన్నారు.

మూసాబౌలి/బహదూర్‌పుర వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాలనుకునే వాహనాలు సిటీ కళాశాల వద్ద నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news