13 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో త్రిష రీ ఎంట్రీ

-

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. పొన్నియిన్ సెల్వన్- 2, ది రోడ్, లియో చిత్రాల్లో నటించి మంచి హిట్ అందుకుంది. ఇక ఈ ఏడాది కూడా అంతకుమించిన స్పీడ్తో దూసుకెళ్లేందుకు రెడీ అవుతోంది ఈ భామ. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ త్వరలోనే బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనుందట.

దాదాపు 13 ఏళ్ల తర్వాత త్రిష హిందీ సినిమాలో నటించనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో ఈ బ్యూటీ జత కట్టనుందట. ప్రముఖ డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కిస్తున్న ‘ది బుల్’ సినిమాలో త్రిషను హీరోయిన్గా తీసుకోనున్నారట. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ పారామిలిటరీ ఆఫీసర్గా కనిపించనున్నట్లు సమాచారం.

త్రిష 2010లోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన ‘ఖట్టా మీఠా’ సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో బాలీవుడ్కి బై చెప్పిన త్రిష సౌత్ సినిమాలతో బిజీ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news