అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. ప్రధాని మోదీ ’11 రోజుల పాటు అనుష్ఠానం’

-

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక భావోద్వేగ సందేశం ఇచ్చారు. ఇవాళ్టి నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఆడియో సందేశం విడుదల చేసిన మోదీ ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్టు చేశారు. ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని ఈ వీడియోలో మోదీ పేర్కొన్నారు.

రామాలయ ప్రాణప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉందని మోదీ అన్నారు. ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని చెప్పారు. ఈ క్రమంలోనే ఈరోజు నుంచి 11 రోజుల ప్రత్యేక ఆరాధనను మొదలు పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను ఎంతో ఉద్వేగంతో ఉన్నానన్న ప్రధాని తన మనసులో తొలిసారి ఇలాంటి భావాలు మెదులుతున్నాయని ఎమోషనల్ అయ్యారు. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవ రూపం దాల్చుతాయని.. ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భం అంటూ ఈ సందేశంలో పేర్కొన్నారు మోదీ.

Read more RELATED
Recommended to you

Latest news