రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ గణతంత్రి దినోత్సవ శుభాకాంక్షలు

-

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛా స్వాతంత్య్రం సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే భారత రాజ్యాంగ స్ఫూర్తి అని పేర్కొన్నారు. అందుకే భారత్ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. గణతంత్ర దినోత్సవ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకుంటూ రాజ్యాంగ నిర్మాతలను, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవాలని అన్నారు.

ప్రజల పోరాటంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న సీఎం కొత్త ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుందని రేవంత్ తెలిపారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రజా పాలనకు శ్రీకారం చుట్టామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియంత పోకడలను పాతర పెట్టి రాజ్యాంగబద్ధమైన విలువలను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి సిద్ధపడిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news