కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కాళ్ల‌కు దండం పెట్టిన ఫ్యాన్ చుక్కెదురు

-

నిన్న ఉప్పల్ స్టేడియంలో ఓ యువకుడు పోలీసుల కళ్ళు గప్పి టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్ళు మొక్కాడు. భారీ సెక్యూరిటీని ఛేదించుకొని మైదానంలోకి వెళ్లడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డి(20)గా గుర్తించారు.

కాగా భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ల తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయిన భారత్ 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (76), శుభమన్ గిల్ (14) పరుగులతో ఉన్నారు. భారత్ తొలి వికెట్ రోహిత్ శర్మ(24) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 64.3 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news