రాష్ట్ర ప్రభుత్వం పై పోచారం హాట్ కామెంట్స్..!

-

బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం పై పోచారం హాట్ కామెంట్స్ చేసారు. అసెంబ్లీలో 39 మంది BRS ఎమ్మెల్యేలు వున్నారని.. అదేమీ చిన్న సంఖ్య కాదు అన్నారు. 25 మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు మా పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పారు.

మర్యాదగా ప్రవర్తిస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం అని పోచారం అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువ తక్కువ చేస్తే మేము ఏంటో చూపిస్తాం అని చెప్పారు. 6 గ్యారంటిలు అమలు చేయడానికి కింద మీద పడుతున్నారన్నారు. డబ్బులు ఏమన్నా ప్రింటింగ్ చేస్తారా , వచ్చిన ఆదాయాన్ని పంచాలి అని పోచారం అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ వి 420 హామీలు అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news