సిరిసిల్ల మున్సిపల్ లో ముసలం..రంగంలోకి కేటీఆర్ ?

-

సిరిసిల్ల మున్సిపల్ లో ముసలం నెలకొంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి సమావేశం నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు కౌన్సిలర్లు. చైర్ పర్సన్ తో విభేదించి క్యాంపునకు 12 మంది కౌన్సిలర్లు వెళ్లారట. ఇక నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి పలువురు కౌన్సిలర్లు.. డుమ్మాకొట్టినట్లు సమాచారం.

Musalam in Sirisilla Municipal

మున్సిపల్ లో అవిశ్వాసం దిశగా కౌన్సిలర్లు అడుగులు కదులుతున్నారట. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త తల నొప్పులు వస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సొంత పార్టీ లీడర్లే రెడీ అయినట్టు సమాచారం అందుతోంది. నిధుల కేటాయింపులో వివక్ష చూపడం, కొందరు కౌన్సిలర్ లకే ప్రయారిటీ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అవిశ్వాసం పెట్టాల్సిందే – కుర్చీ నుంచి దించాల్సిందేనని బీఆర్‌ఎస్‌ లోని కొంత మంది కౌన్సిలర్లు పట్టుబడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news