ఇంద్రవెల్లి స్తూపం ని తాకే హక్కు రేవంత్ రెడ్డి కి లేదు: జోగు రామన్న

-

రేవంత్ రెడ్డి నిన్న ఇంద్రవెల్లిలో చేసిన ప్రసంగం మీద మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తూ ఆయన మాట్లాడ్డం జరిగింది. ఇంద్రవెలలో వందలాది మంది ఆదివాసీలని కాంగ్రెస్ పొట్టన పెట్టుకుందని అన్నారు. సీఎం క్షమాపణ చెప్తే సరిపోతుందా అని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి స్థూపం తాకే హక్కేలేదని అన్నారు స్తూపం కట్టిన తర్వాత కూల్చింది కాంగ్రెస్ వాళ్ళే అని ఆయన గుర్తు చేశారు. ప్రజా సంఘాలు ఒత్తిడితో ఆ స్థూపం మళ్ళీ నిర్మాణమైందని చెప్పారు కేసీఆర్ సీఎం అయ్యాకే స్థూపం దగ్గరికి వెళ్లే స్వేచ్ఛ దొరికిందని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారో నిన్న కూడా రేవంత్ రెడ్డి అదే మాట్లాడారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news