మార్చి 17 తరవాత రేవంత్ రెడ్డికి గట్టిగా సమాధానం ఇస్తాం: KTR

-

రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తామని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు మార్చి 17 తర్వాత గట్టిగా సమాధానం ఇస్తామని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వాళ్ళు చేసే వెధవ పని గుర్తొస్తుందని అన్నారు. ఇచ్చిన మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. పదేళ్లలో కరెంటు పోలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంటు పోతోందని అన్నారు.

డిసెంబర్ 9న రైతులు లోన్లు తెచ్చుకో అన్నాడు ఇప్పుడు దాకా రుణమాఫీ చేయలేదని చెప్పారు కేటీఆర్. ఇంకా రుణమాఫీ కాలేదని అన్నారు. 500 రూపాయలు బోనస్ రైతులకు ఇస్తామని అన్నారు. అది కూడా ఇవ్వలేదు. మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం చెప్తామని హెచ్చరించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అంటున్నారని చెప్పారు. పదేళ్లు మోడీ మాకు సహకరించకపోయినా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చమని అన్నారు. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గితే మంచిదని అన్నారు మంచిది కాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news