తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఈ నెల18 నుంచి టికెట్లు విడుదల

-

తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఈ నెల18 నుంచి తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి మే నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇక అటు ఈ నెల 16వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే.. ఒకే రోజు సప్తవాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.

ఇక ఈ నెల 15,16,17వ తేదీలలో తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్లు విధానాన్ని రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారి దర్శనానికి నిన్న ఒక్క రోజే…22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 57,357 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 18, 924 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news